వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో బుధవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,960 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,500 ధర పలకగా.. వండర్ హాట్ (WH) మిర్చి రూ. 30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,350, ఎల్లో మిర్చి రూ. 21,500 ధర పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.