నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమవారం ఉదయం 35,416 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 33,910 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802, టీఎంసీలకు గాను ప్రస్తుతం 17.455 టీఎంసీలు నమోదైంది.