ఏలూరులో వైసీపీ శ్రేణులు నిరసన

ఏలూరులో వైసీపీ శ్రేణులు నిరసన

ఏలూరు 45వ డివిజన్ ఆదివారపు పేటలో వేసవికాలం సందర్భంగా స్థానిక నాయకులు పసుపులేటి దినేష్ ఇటీవల మంచినీటి చలివేంద్రంను ఏర్పాటు చేశారు. దానిని కక్షపూరితంగా ఇవాళ తెల్లవారుజామున తొలగించడాన్ని వైసీపీ శ్రేణులు ఖండించారు. నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టారు.