'మెరుగైన ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి అవసరం'
PPM: మెరుగైన ఆరోగ్యానికి స్వచ్ఛమైన గాలి అవసరమని, పర్యావరణ రహిత మార్గాన్ని ప్రతీ ఒక్కరూ అవలంబించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. డోకిశీల పిహెచ్సి గిరిజన సంక్షేమ హాస్టల్ను అధికారులతో కలసి శనివారం సందర్శించారు. హాస్టల్, ఆసుపత్రి పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్యంపై ఆరా తీశారు.