'పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'
SDPT: పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ పూజల హరికృష్ణ పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలం చెర్లఅంకిరెడ్డిపల్లిలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండవ విడతలో అర్హులైన వారికి పక్కాగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.