ఒంగోలులో తొలి సారిగా రాష్ట్ర మహాసభలు

ఒంగోలులో తొలి సారిగా రాష్ట్ర మహాసభలు

ప్రకాశం: ఒంగోలు వేదికగా జరగబోయే సీపీఐ 28వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవీంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లాలో తొలిసారిగా నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఈనెల 23న ఒంగోలులో నిర్వహించబోయే బహిరంగ సభ, ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు.