రూ.39,436 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
GNTR: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.