U-19 హ్యాండ్ బాల్కు 320 మంది హాజరు
MBNR:మహబూబ్నగర్లోని ఓ హైస్కూల్లో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 హ్యాండ్బాల్ రాష్ట్రస్థాయి బాల బాలికల క్రీడలు ఆదివారం జరిగాయి. ఈ పోటీలకు 320 మంది క్రీడాకారులు, 40 మంది కోచ్ మేనేజర్లు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులను బాలురను గుజరాతకు, బాలికలను హిమాచల్ ప్రదేశ్కు జాతీయ స్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.