కారు ఢీకొని బాలుడు మృతి

VSP: కంచరపాలెంలోని సుభాష్నగర్లో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ITI జంక్షన్ నుంచి ఊర్వశి జంక్షన్ వైపు వస్తున్న కారు బాలుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి వర్షిత్(15) అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో కారు నడిపిన వ్యక్తికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.