'రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది'
RR: షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించారు. హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అందేలా చూడాలని ఆర్డివో సరితకు ఫోన్లో ఆదేశించారు.