తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం భక్తులు 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 67,202 మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. 25,864 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.