వైద్యం వికటించి బాలుడు మృతి
HYD: హయత్నగర్లో పైల్స్ సమస్యతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడు ఆసుపత్రిలో చేరాడు. సైదా పైల్స్ క్లినిక్లో చికిత్స పొందుతున్న బాలుడికి ఆదివారం రాత్రి ఆపరేషన్ జరిగింది. కాగా, ఆపరేషన్ వికటించడంతో బాలుడు మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. నకిలీ డాక్టర్లు క్లినిక్లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.