'ఛలో విజయవాడ విరమించాలి'
కోనసీమ: అంగన్వాడీలు ఛలో విజయవాడ విరమించాలని రావులపాలెం మండల TDP అధ్యక్షుడు కొప్పిశెట్టి ప్రసాద్ కోరారు. సోమవారం వెదిరేశ్వరంలో అంగన్వాడీలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేంద్రాల అప్గ్రేడ్, కొత్త సహాయకుల నియామకం చేపడుతుందని వివరించారు. ఈ పర్యటనలో పలువురు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.