అనుపమ 'లాక్డౌన్' ట్రైలర్ వచ్చేసింది
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో AR జీవా దర్శకత్వంలో 'లాక్డౌన్' సినిమా తెరకెక్కింది. వచ్చే నెల 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశాడు. ఇక కరోనా టైంలో విధించిన లాక్డౌన్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ సినిమాలో చార్లీ, నిరోష, ప్రియా వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.