భర్తను హత్య చేసిన భార్య అరెస్టు

ప్రకాశం: మద్యానికి బానిసై వేధిస్తున్నాడని భర్తను భార్య హత్య చేసిన ఘటనను పోలీసులు చేదించారు. కంభంలో ఈనెల 3వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. హత్య తర్వాత భర్త అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా మీడియా సమావేశంలో డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితురాలిని అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.