'మంద కృష్ణ మాదిగ సభను విజయవంతం చేద్దాం'

SRPT :ఈ నెల 31న కోదాడలో జరగనున్న మంద కృష్ణ మాదిగ సభను విజయవంతం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడు మోషే పిలుపునిచ్చారు. ఇవాళ చాకిరాల గ్రామంలో వికలాంగులు, వితంతువుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి, పింఛన్లు పెంచే వరకు ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.