నేడు కలసపాడులో ఉపాధి హామీ ప్రజా వేదిక

నేడు కలసపాడులో ఉపాధి హామీ ప్రజా వేదిక

KDP: కలసపాడు MPDO కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు MPDO మహబూబీ వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 పంచాయతీల్లో జరిగిన ఉపాధి పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరుగుతుందన్నారు. తనిఖీలో గుర్తించిన అంశాలపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రజలు, కూలీలు, అధికారులు హాజరుకావాలని సూచించారు.