ప్రశాంతంగా ఓటింగ్
MDK: మెదక్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మూడో విడత ఎన్నికలలో కౌడిపల్లి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు.