దేశవ్యాప్తంగా SFI పటిష్టంగా ఉంది: లక్ష్మణరావు

GNTR: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా విస్తృతస్థాయి సమావేశం బ్రాడీపేటలో మంగళవారం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ కెయస్. లక్ష్మణరావు సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటూ దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పటిష్టంగా ఉండటం శుభపరిణామని కొనియాడారు.