'పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితన పరిష్కరించాలి'

'పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితన పరిష్కరించాలి'

W.G: భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.