జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన డీఈవో

జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించిన డీఈవో

NTR: కంచికచర్ల మండల పరిధిలోని పెండ్యాల జిల్లా పరిషత్ హై స్కూల్‌ను DEO చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల బోధన విధానం, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పదవ తరగతి విద్యార్థులు 100 డేస్ ప్రణాళికను కచ్చితంగా పాటించాలని సూచించారు. సమయపాలనతో చదువుకు ప్రాధాన్యత ఇచ్చి పది ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపాలన్నారు.