రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

SRD: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొండాపూర్ మండలం గుంతపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై సోమేశ్వరి కథనం ప్రకారం.. శంకర్ పల్లి మండలం గాజుల గూడెం గ్రామానికి చెందిన రాములు(50) బైక్పై వెళుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ గుంతపల్లి శివారులో ఢీకొట్టింది. రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.