దీపావళి వేళ 10 మందికి గాయాలు
విశాఖలో దీపావళి పండగ నేపథ్యంలో టపాసులు పేలి 10 మంది వరకు గాయపడ్డారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కేజీహెచ్కు గాయపడిన వారు ఓపికి చేరుకోగా చికిత్స అందజేశామని ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ కేసుల సంఖ్య నమోదు అయింది.