GPS స్పూఫింగ్పై అజిత్ దోవల్ ఆఫీస్ సీరియస్!
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో ఇటీవల ATC సమస్యల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిన విషయంపై సంచలన వార్తలు వెలువడ్డాయి. దానికి ముందు GPS స్పూఫింగ్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో NSA అజిత్ దోవల్ కార్యాలయం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడం వల్ల దీనిపై దోవల్ సీరియస్గా దృష్టి సారించినట్లు సమాచారం.