తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ
కొత్తగూడెంలోని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 1,258 మంది తాత్కాలిక ఉద్యోగులను ఇకనుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను జారీ చేయనున్నట్లు సింగరేణి అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.