తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా.. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 62,129 మంది భక్తులు దర్శించుకోగా. 20,026 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అటు హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ తెలిపింది.