వినాయక స్వామికి వెండి తొండం, హస్తములు విరాళం

వినాయక స్వామికి వెండి తొండం, హస్తములు విరాళం

CTR: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారికి బెంగళూరుకు చెందిన భక్తుడు కిషోర్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 2 కిలోల 700 గ్రాముల బరువున్న వెండి తొండం, హస్తములు విరాళంగా సమర్పించారు. వీటి విలువ సుమారు రూ.3.50 లక్షలు అని తెలిపారు. ఆలయ అధికారులు దాతలకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.