గుడారాల పండుగకు ప్రత్యేక రైళ్లు
GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుడారాల పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే మార్చి 5 నుంచి 8 వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ పోర్ట్-విజయవాడ, విజయవాడ-గుంటూరు మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పండగ ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.