సీతారామపురంలో దగ్ధమైన పాక.. ఎంపీపీ పరామర్శ
NDL: మహానంది మండలం సీతారామపురం గ్రామంలో విద్యుత్ షాక్తో దగ్ధమైన గజ్జ వెంకటసుబ్బయ్యకు చెందిన పశువుల పాక బాధిత కుటుంబాన్ని ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని సోమవారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి జరిగిన నష్టంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. వారికి తక్షణ సహాయంగా రూ.5,000 ఆర్థిక అందజేసి, అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.