నగరంలో నేడు పవర్ కట్

GNTR: నగరంలో రహదారి విస్తరణ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.గురవయ్య తెలిపారు. SVN కాలనీ, జేకేసీ కాలేజ్ రోడ్డు, తారకరామనగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించగలరు అని ఆయన కోరారు.