పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
E.G: రంగంపేట మండలం వడిశలేరులో సుమారు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, స్థానిక సొసైటీ వద్ద శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.