VIDEO: 'లబ్ధిదారులకు పీఎం సూర్య ఘర్ పథకం వరం లాంటిది'
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బిళ్లకుర్రు సబ్స్టేషన్ వద్ద రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన 11 కేవీ లైన్ ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్లను ఇవాళ ప్రారంభించారు. అనంతరం కొత్తపేట గోగువారి పేటలో పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ యూనిట్ను ప్రారంభించారు. ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.