రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కృష్ణమ్మ
KRNL: మంత్రాలయం–చిలకలడోణ రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందడం పట్ల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఇవాళ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను కోరారు. అత్యంత హృదయవిదారకమైన ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.