'నీటి సరఫరా నిలిచే అవకాశం'
ADB: పూసీగుడ పంప్రూమ్లో మిషన్ భగీరథ కార్మికులు అపెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ ఇన్ఛార్జ్ AEకి వినతి పత్రం ఇచ్చారు. ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. ఈనెల 10లోగా జీతాలు చెల్లించకపోతే నార్నూర్, గాదిగూడ మండలాలకు భగీరథ నీటి సరఫరా నిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కార్మికులు పాల్గొన్నారు.