వాడపల్లి స్వామివారి నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

వాడపల్లి స్వామివారి నిత్యాన్నదాన పథకానికి భారీ విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి కొత్తపేట వాస్తవ్యులు తురగా సత్యనారాయణ సోమవారం రూ.1,00,005 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులు తొలుత స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సిబ్బంది దాత కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.