VIDEO: 'జోకర్లా మాట్లాడడం సిగ్గుచేటు'
WGL: కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ వర్ధన్నపేటలో మాట్లాడుతూ.. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందు ప్రదర్శించండి. బాధ్యతగల కేంద్ర మంత్రి పదవిలో ఉండి జోకర్ల మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరులో బీజేపీ ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడని గుర్తు చేశారు.