కుటుంబ కలహాలతో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

అన్నమయ్య: కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లెలో శనివారం జరిగింది. ఫైర్ స్టేషన్ సమీపంలో కాపురం ఉంటున్న జ్యోతి(26) కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందిందని వన్ టౌన్ సీఐ ఎరిసా వలి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.