రైల్వే స్టేషన్లో క్వార్టర్లీ తనిఖీలు
VZM: బొబ్బిలి రైల్వే స్టేషన్ను విశాఖపట్నం ఐఆర్పీ అధికారి ఏ.రవికుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రతను బలోపేతం చేసేందుకు క్వార్టర్లీ తనిఖీలు చేపట్టామన్నారు. రైళ్లలో దొంగతనాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సిబ్బందికి సూచించారు.