యాషెస్: గెలుపు దిశగా ఆస్ట్రేలియా..!
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 రన్స్ చేయగా, ఆసీస్ 511 పరుగులు చేసి.. 177 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి 134/6 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ స్కోర్కు మరో 43 పరుగులు వెనుకబడి ఉంది.