గుంటూరులో 185 మందికి అతిసారం
GNTR: గుంటూరులో ఇప్పటి వరకు 185 మంది అతిసారంతో జీజీహెచ్లో చేరారు. వీరిలో ప్రస్తుతం 104 మంది ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రగతినగర్, రామిరెడ్డినగర్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆర్వో ప్లాంట్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కొన్నిట్లో బ్యాక్టీరియా ట్రేసెస్ అధికారులు గుర్తించారు. కావున ప్రజలు బయట ఆహారం అవాయిడ్ చేస్తే మంచిదని వైద్యులు తెలిపారు.