జిల్లాలో 10 మంది ఎస్సైల బదిలీ
KRNL: జిల్లా పోలీసు శాఖలో పది మంది ఎస్సైలకు స్థానచలనం కలిగింది. వీరిలో వివిధ స్టేషన్లలో అటాచ్డ్ విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మందికి రెగ్యులర్ పోస్టింగ్ కేటాయిస్తూ బుధవారం రాత్రి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలన సౌలభ్యంలో భాగంగా ప్రస్తుతం వారున్న స్టేషన్ నుంచి మరో స్టేషన్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.