మందుబాబులకు బ్యాడ్ న్యూస్!

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మందుబాబులకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బ్రాందీ, విస్కీ, రమ్, వైన్, విదేశీ స్కాచ్ ధరలను 10 శాతం మేర పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొత్త ధరలు అమలైతే బ్రాండ్ను బట్టి క్వార్టర్ మీద రూ.10 నుంచి రూ.80 వరకు పెరుగుతాయని అంచనా. దీంతో ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచిన ప్రభుత్వంగా రేవంత్ సర్కార్ నిలువనుంది.