'బుడమేరు భూగర్భజలాలు కలుషితమని అనుమానం'

NTR: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, ఏంపీ చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు.