విద్యుత్ షాక్తో యువకుడి మృతి

SDPT: విద్యుత్ షాక్కు గురై యువకుడు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హనుమాన్ నగర్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలుల వర్షానికి బాత్రూంపై కరెంటు తీగ తెగిపడింది. అది గమనించకుండా వెళ్లిన శివాజీ (18) కరెంటు షాక్తో మృతి చెందాడు.