'పత్తి కొనుగోలు చేస్తే MLA పదవీకి రాజీనామా చేస్తా'
ADB: గతంలో ఉన్న ప్రభుత్వాలు 20 శాతం తేమతో పత్తి కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని పాయల్ శంకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రైతు సమస్యలపై ఆదిలాబాద్కు వచ్చి.. బీజేపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖలు చేయడం సరి కాదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులను పట్టించుకోలేదని.. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు.