తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
TPT: తిరుమల వెళ్లే ఘాట్ రోడ్డులో మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. లగేజ్ సెంటర్లో పనిచేసే లోకేశ్ బైకు మీద కొండకు బయల్దేరాడు. హరిణి ప్రాంతంలోకి రాగానే ఒక్కసారిగా కొండపై నుంచి చిన్నపాటి రాయి వచ్చి లోకేశ్ కు తగిలింది. బైక్ మీద నుంచి పడిపోవడంతో తల, శరీర భాగాలకు గాయాలయ్యాయి. తొలుత అశ్విని, తర్వాత తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి అతడిని తరలించారు.