ఓవర్ లోడ్తో వెళుతున్న వాహనాలకు జరిమానా
AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం వద్ద ఓవర్ లోడ్తో వెళ్తున్న నాలుగు లారీలకు పోలీసులు భారీ జరిమానా విధించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోడి వాసు, సీఐ నర్సింగరావు, ఎస్సై నాగేంద్ర కలిసి బుధవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్తో వెళ్తున్న నాలుగు లారీలకు రూ.2,85,180 జరిమానా విధించినట్లు తెలిపారు.