151కి చేరిన మృతుల సంఖ్య

నైజీరియా వరదల్లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు విడిచారు. మోక్వా పట్టణంలో రెండు బ్రిడ్జిలు కూలిపోవడంతో 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 3 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.