151కి చేరిన మృతుల సంఖ్య

151కి చేరిన మృతుల సంఖ్య

నైజీరియా వరదల్లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 151 మంది ప్రాణాలు విడిచారు. మోక్వా పట్టణంలో రెండు బ్రిడ్జిలు కూలిపోవడంతో 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. దాదాపు 3 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరణించే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.