రెండు నెలలు చేపల వేట నిషేధం

రెండు నెలలు చేపల వేట నిషేధం

SKLM: ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధిస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు నిబంధనలు వర్తిస్తాయి. జిల్లాలో 193 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండగా, 11 మండలాల పరిధిలో 1,565 మెకనైజ్డ్ బోట్లు, 2557 సంప్రదాయ పడవలు ఉన్నాయి. మత్స్యకారులకు రూ. 20 వేలు ప్రభుత్వం అందజేస్తుంది.