'క్రమశిక్షణతో కష్టపడి చదవాలి'
HNK: విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్ అన్నారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు బ్యాగ్స్, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యసాధనకై ఏకాగ్రతతో చదవాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవ, కంచరాజు కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.